News March 20, 2025
ములుగు: బెట్టింగ్ యాప్లపై నిఘా: SP

ఆన్లైన్ బెట్టింగ్, గేమ్లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. యాపుల్లో బెట్టింగుకు పాల్పడినా, గేమింగ్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్కు అలవాటు పడి, డబ్బులు కోల్పోయి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇలాంటి యాప్ల వల్ల ఆత్మహత్యలకు దారితీస్తుందన్నారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 6, 2025
ఊట్కూర్: మారనున్న పెద్ద చెరువు రూపురేఖలు

నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఊట్కూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువును విస్తరించి రిజర్వాయర్గా మార్చనున్నారు. దీని నిలువ సామర్థ్యం 0.27 టీఎంసీలు. 19 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి ప్రెషర్ మెయిన్ పద్ధతిలో జయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్ ఎత్తిపోస్తారు. భూసేకరణ జరిగిన, డబ్బు రైతు ఖాతాలో జమ కాలేదు.
News November 6, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.
News November 6, 2025
కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.


