News January 30, 2025

ములుగు: ‘బోనస్’ కోసం రైతుల ఎదురుచూపులు!

image

ములుగు జిల్లాలో రైతులు వరి ధాన్యం బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. నెలన్నర దాటిన తమ ఖాతాలో బోనస్ జమ కాలేదని వాపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11,379 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా 4,885 మంది రైతులకు మాత్రమే రూ.15.64 కోట్లు చెల్లించారు. 6,494 మంది రైతులు తమకు రావాలసిన రూ.19.36 కోట్ల బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బోనస్ ఖాతాలలో జమ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Similar News

News December 1, 2025

సిద్దిపేట: సమస్యాత్మక గ్రామాల్లో నిఘా

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వినియోగించాలని వివరిస్తున్నారు. ఆదివారం గజ్వేల్, మిరుదొడ్డి, అక్బర్పేట్-భూంపల్లి మండలాల్లో ACPల ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలను జాగృతం చేశారు.

News December 1, 2025

గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

image

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.

News December 1, 2025

గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

image

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.