News January 30, 2025
ములుగు: ‘బోనస్’ కోసం రైతుల ఎదురుచూపులు!

ములుగు జిల్లాలో రైతులు వరి ధాన్యం బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. నెలన్నర దాటిన తమ ఖాతాలో బోనస్ జమ కాలేదని వాపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11,379 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా 4,885 మంది రైతులకు మాత్రమే రూ.15.64 కోట్లు చెల్లించారు. 6,494 మంది రైతులు తమకు రావాలసిన రూ.19.36 కోట్ల బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బోనస్ ఖాతాలలో జమ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Similar News
News October 16, 2025
శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని మోదీ

AP: ప్రధాని మోదీ ఇవాళ శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. గతంలో ఆ హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు. భారత వాయుసేన విమానంలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు, అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. అటు మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది.
News October 16, 2025
దైవ నామాన్ని ఎప్పుడు స్మరిస్తే ఏ ఫలితం ఉంటుంది?

కార్య సాధనలో దైవ నామ స్మరణ గొప్ప ఫలితాలను ఇస్తుంది. నడుస్తూ దేవుడి పేరును జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. వంట చేసే సమయంలో దైవ నామస్మరణ చేస్తే ఆహారం మహా ప్రసాదంగా మారుతుంది. స్నానం చేసేటప్పుడు దేవుడి పేరును తలుచుకుంటే ఆ స్నానం తీర్థ స్నానంతో సమానమవుతుంది. నిద్రించే ముందు దేవుని ధ్యానం చేస్తే అది ధ్యాన నిద్రగా మారుతుంది. మనం నివసించే ఇంట్లోనే దైవాన్ని స్మరిస్తే ఆ ఇల్లే పవిత్ర దేవాలయంగా మారుతుంది.
News October 16, 2025
తెలంగాణ అప్డేట్స్

*నేడు క్యాబినెట్ భేటీ.. BC రిజర్వేషన్ బిల్లు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం
*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. GO-9పై హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన రేవంత్ సర్కార్
*నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 సెంటర్లలో మొక్కజొన్న పంట కొనుగోళ్లు