News January 30, 2025
ములుగు: ‘బోనస్’ కోసం రైతుల ఎదురుచూపులు!

ములుగు జిల్లాలో రైతులు వరి ధాన్యం బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. నెలన్నర దాటిన తమ ఖాతాలో బోనస్ జమ కాలేదని వాపోతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 11,379 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా 4,885 మంది రైతులకు మాత్రమే రూ.15.64 కోట్లు చెల్లించారు. 6,494 మంది రైతులు తమకు రావాలసిన రూ.19.36 కోట్ల బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బోనస్ ఖాతాలలో జమ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Similar News
News November 16, 2025
ఏపీకే ఫైలు ఓపెన్ చేయొద్దు: సీఐ యాదగిరి

చరవాణీలకు వచ్చే ఏపీకే ఫైలు తెరవొద్దని నరసాపురం పట్టణ సీఐ బి.యాదగిరి ప్రజలకు సూచించారు. ఆయన ఫోన్కు వాహన అపరాధ రుసుము చలానా పెండింగ్ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ ఫైలు సందేశాన్ని ప్రజలకు అవగాహన నిమిత్తం సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచారు. అటువంటి ఫైళ్లను తెరవొద్దని, తెరిస్తే ఫోన్ హ్యాక్ అయి సైబర్ నేరగాళ్ల చేతికి బ్యాంకు ఖాతాలు, పాస్వర్డ్ చేరే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.
News November 16, 2025
నేడు నాన్ వెజ్ తినవచ్చా?

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.
News November 16, 2025
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్ యాసిడ్, స్క్వాలేన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది.


