News December 4, 2024
ములుగు: భార్య జైలులో.. భర్త ఎన్కౌంటర్లో మృతి
ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో ఒకరైన ముసాకి దేవల్@ కరుణాకర్ ఐదేళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లాడని తండ్రి బుజ్జ తెలిపారు. భార్య రీత కూడా దళసభ్యురాలు కావడం గమనార్హం. కాగా, ఏడాదిక్రితం చర్ల వద్ద రీతను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం ఖమ్మంలో జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి బుజ్జ మాటవినకుండా అడవిలోకి పోయి, ఎన్కౌంటర్ర్లో చనిపోయినట్లు తెలిపాడు.
Similar News
News January 17, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుంది: ఎంపీ కావ్య
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలన్నింటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
News January 17, 2025
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రావీణ్య
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హన్మకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ పథకాల కోసం నిర్వహిస్తున్న సర్వేను నేడు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News January 17, 2025
వరంగల్: లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డులకు కోసం 1.57లక్షల దరఖాస్తులు గతంలోనే వచ్చాయి. ఆత్మీయ భరోసాకు 18 లక్షల EGS కార్డులు ఉన్నాయి.రైతు భరోసాలో 8.77 లక్షలు గత సీజన్లో లబ్ధి పొందారు. వీటిపై ఈ నెల 20 వరకు దరఖాస్తులను పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు.