News April 11, 2025
ములుగు, భూపాలపల్లి, MHBD జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. నేడు వర్షాలు కురిసే అవకాశముందని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News November 16, 2025
వణికిస్తున్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
News November 16, 2025
మత సామరస్యానికి ప్రతీక వావరు స్వామి గుడి

వావరు స్వామి అయ్యప్పకు అత్యంత ప్రీతిపాత్రుడైన ముస్లిం భక్తుడు. శబరిమల యాత్రలో, ఎరుమేలిలో ఉన్న వావరు స్వామి ఆలయం మత సామరస్యాన్ని చాటిచెప్పే గొప్ప కేంద్రంగా ఉంది. అయ్యప్ప భక్తులు మొదటగా ఆయనను దర్శించుకోవడం, పక్కనే ఉన్న పేటతుళసి ఆలయంతో ఈ ఆలయం ఉండటం.. హైందవ, ముస్లిం ఐక్యతకు ప్రతీక. వావరు స్వామి ఆలయ దర్శనం, దైవం ముందు అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 16, 2025
SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

TG: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ త్వరలో ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.


