News January 10, 2026

ములుగు: మంత్రి నిర్ణయమే ఫైనల్..!

image

కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా పూర్తి స్థాయి కార్యవర్గం లిస్ట్ రెడీ అయ్యింది. ఇప్పటికే అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ ఎన్నికయ్యారు. 36 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేయగా ఉపాధ్యక్షులుగా ముగ్గురు, ప్రధాన కార్యదర్శులుగా ఆరుగురు, కార్యదర్శులుగా ఐదుగురు, కోశాధికారిగా ఒక్కరు, అధికార ప్రతినిధిగా ఒక్కరు, కార్యవర్గ సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు. మంత్రి సీతక్క ఓకే చెప్పిన వెంటనే ప్రకటించనున్నారు.

Similar News

News January 18, 2026

కరీంనగర్ జిల్లాలో వార్డుల రిజర్వేషన్లు పూర్తి

image

KNR జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ సహా జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి లాటరీ పద్ధతిన ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News January 18, 2026

SRCL: రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్ల ఖరారు

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రాజకీయ పార్టీల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డుల్లో రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.

News January 18, 2026

గచ్చిబౌలిలో కనువిందు చేసిన డ్రోన్‌ ఫెస్టివల్

image

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘డ్రోన్ ఫెస్టివల్ 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ డ్రోన్‌ షోలో రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, పాలపిట్ట వంటి తెలంగాణ చిహ్నాలను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.