News April 11, 2025

ములుగు: ‘మావో’లకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం!

image

ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ల వద్ద పోస్టర్లు వెలిశాయి. అడవుల్లో మందు పాతరలు పెట్టి ఆదివాసీలను మావోయిస్టులు అడ్డుకుంటున్నాని, మమ్మల్ని బతకనివ్వరా.? మా ప్రాంతాలపై మీ పెత్తనం ఏంటని పోస్టర్లలో ప్రశ్నించారు.

Similar News

News October 30, 2025

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్‌లో

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.

News October 30, 2025

తుపానుతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కలిగిన ప్రాథమిక నష్టం అంచనాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆదేశించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదన్నారు. 4 పశువులు చనిపోయాయని, 18 ఇళ్లు దెబ్బతిన్నాయని, 9,298 ఎకరాలలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. తుపాను నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు.

News October 30, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు.. సుడిదోమ నివారణ ఎలా?

image

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంటను సాగు చేస్తున్నప్పుడు సుడిదోమ ఉద్ధృతి పెరిగితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వరి పొలంలో కాలిబాటలను తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 25 చొప్పున అమర్చాలి. 5 నుంచి 6 లీటర్ల తూటికాడ, కుంకుడు కాయల రసాన్ని 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారీ చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.