News April 4, 2025

ములుగు: యువతపై కన్నేసి ఉంచాలి!

image

ములుగు జిల్లాలో విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు మేధావులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. తల్లిదండ్రులు పిల్లల కదలికలు, అలవాట్లు, మొబైల్ వాడకంపై నిఘా పెట్టాలంటున్నారు. జిల్లాలో ఇప్పటికే గంజాయి, బోనోఫిక్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని, వ్యసనంగా మారి అనర్ధాలకు దారి తీయకముందే అదుపు చేయాలని కోరుతున్నారు.

Similar News

News February 26, 2026

తరచూ ఈ టెస్టులు చేయించుకోవడం బెటర్!

image

ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా CBC ద్వారా రక్తహీనతను, HbA1cతో షుగర్ లెవల్స్‌ను గుర్తించవచ్చు. LFT లివర్ పనితీరును, KFT కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుపుతాయి. విటమిన్ D ద్వారా బోన్ హెల్త్, గుండె పనితీరుకు ECG, Lipid Profile టెస్టులు కీలకం. విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. SHARE IT

News February 26, 2026

IASల బదిలీ: ఒకే జిల్లాలో భార్యాభర్తల విధులు

image

IASల బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దంపతులకు ఒకే జిల్లాలో పోస్టింగ్‌లు ఇచ్చారు. హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయిని నియమించగా, ఆమె భర్త వరుణ్ రెడ్డి ప్రస్తుతం NPDCL సీఎండీగా హనుమకొండలోనే ఉన్నారు. స్నేహ శబరీశ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేయగా, ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం అదే జిల్లాకు SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి.

News February 26, 2026

ADB: పరిషత్ పోరు జరగకుంటే.. రూ. 450 కోట్లు గల్లంతేనా..?

image

ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. BC రిజర్వేషన్ల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను మార్చి 2వ వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 71 ZPTC, 579 MPTC స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.