News April 2, 2025

ములుగు: ‘రజతోత్సవ సభను విజయవంతం చేస్తాం’

image

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేస్తామని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈరోజు హైదరాబాదులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

SVUలో అధిక ఫీజులు.. అయినా.!

image

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MBA, MCA, PG సెమిస్టర్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతర యూనివర్సిటీల్లో రూ.1500లోపు సెమిస్టర్ ఫీజులు ఉండగా.. SVUలో మాత్రం రూ.4వేల వరకు ఉందట. ఇంత ఫీజులు కడుతున్నా సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడం లేదంటూ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

image

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.

News December 7, 2025

SRPT: పోస్టల్ బ్యాలెట్ విధిగా వినియోగించుకోవాలి: కలెక్టర్

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను విధిగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేట సహా 8 మండలాల ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.