News February 11, 2025
ములుగు: వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి: డిప్యూటీ డీఎంహెచ్వో

ఈనెల 12 నుంచి జరగనున్న జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఐటిడిఏ డిప్యూటీ డీఎంహెచ్వో క్రాంతి కుమార్ అన్నారు. ఈరోజు కొండాయి, ఐలాపురం గ్రామాల్లో నిర్వహించబోయే వైద్యశిబిరాలను ఆయన పరిశీలించారు. ఐలాపురంలో ఇటీవలే నిర్మించిన కంటైనర్ ఆసుపత్రిని సందర్శించారు. Dyడిఎంహెచ్వో మాట్లాడుతూ.. జాతర సమయంలో రోగులకు చికిత్స అందించేందుకు మందులు నిల్వ చేసుకోవాలన్నారు.
Similar News
News March 21, 2025
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.
News March 21, 2025
ALERT: కడప జిల్లాకు వర్ష సూచన

కడప జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడప జిల్లాలతో పాటు అల్లూరి, మన్యం, నంద్యాల, పల్నాడు(D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
News March 21, 2025
భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.