News February 26, 2025
ములుగు: సభలు, సమావేశాలపై నిషేధం

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి, ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం అమలు చేస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పేర్కొన్న ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 153 ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్

పది రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలపై ఈడీ రైడ్స్ చేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో AP, TG, MH, MP, UP, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. గతంలో అధికారులకు లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీల్లో జరిగిన తనిఖీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయా యాజమాన్యాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఈ ఏడాది జూన్లో FIR నమోదైంది.
News November 27, 2025
డబ్బులిస్తే జాబ్ వస్తుందా?.. ఇకనైనా మారండి!

HYDలో ఓ నకిలీ IT కంపెనీ ఉద్యోగాల పేరిట 400 మంది నిరుద్యోగులను మోసగించింది. జాబ్ గ్యారెంటీ పేరుతో రూ.3లక్షల చొప్పున వసూలు చేసింది. ఇలా మోసపోవద్దంటే.. తప్పుదోవలో ఉద్యోగం కోసం వెతక్కుండా స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. ఏ కంపెనీ కూడా డబ్బు తీసుకొని జాబ్ ఇవ్వదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు నేర్చుకుంటే, మీ అర్హత, స్కిల్స్ ఆధారంగా ఉద్యోగం సాధించవచ్చు. నైపుణ్యం ఉంటే ఉద్యోగం మీదే.
News November 27, 2025
నెయ్యి కల్తీకి ఆధారాలు లేవు: YV సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయాన్ని కొన్నాళ్లుగా రాజకీయాల్లోకి లాగుతున్నారని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి అన్నారు. ‘లడ్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎలాంటి ల్యాబొరేటరీ ఆధారాలు లేవు. సిట్ విచారణతో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది TTD ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. యానిమల్ ఫ్యాట్ ఉందన్న నెయ్యిని వాడారన్న CBN ఆరోపణలకు సమాధానం లేదు’ అని YV పేర్కొన్నారు.


