News September 6, 2024
ములుగు: సర్వే చేస్తున్న ఫారెస్ట్ అధికారులు
తాడ్వాయి-మేడారం అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంపై అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ అధికారులు సర్వే చేపట్టారు. విపత్తు కారణంగా 204కు పైగా హెక్టార్లలో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తులో 60,70 రకాల చెట్లు నేలకులాయి. రెండు, మూడు రోజుల్లో అంచన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
Similar News
News October 8, 2024
వరంగల్ మార్కెట్కు వరుస సెలవులు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
News October 8, 2024
మహాకాళి అవతారంలో గంభీరంగా దర్శనమిస్తున్న అమ్మవారు
వరంగల్ నగరవ్యాప్తంగా శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన దుర్గాదేవి ప్రతిమలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ బట్టల బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు భక్తులు తరలివస్తున్నారు. మహాకాళి అవతారంలో గంభీరంగా కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
News October 8, 2024
వరంగల్: పతనమవుతున్న మొక్కజొన్న ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 40 రోజుల క్రితం వరకు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు ధరలు నమోదు చేసిన మొక్కజొన్న.. గత కొద్దిరోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రూ.3వేలకు పైగా పలికిన క్వింటా మక్కలు(బిల్టి) ధర క్రమంగా పతనమై వస్తూ నేడు రూ.2430కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు.