News March 13, 2025
ములుగు: స్కూల్ బస్సులు భద్రమేనా!

ములుగు జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళనలు నెలకొంది. సరైన ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం లేని డ్రైవర్లులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుబులు చెందుతున్నారు. మద్యం మత్తులో, మరమ్మతుకు వచ్చిన పాఠశాల బస్సులు నడిపి ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం.
Similar News
News January 8, 2026
కృష్ణా జలాలపై BRS, కాంగ్రెస్ది పొలిటికల్ డ్రామా: బండి సంజయ్

TG: కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు KCR అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆయన్ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమాలు చేసి KCR మెడలు వంచింది BJPనే అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, BRS లోపాయికారీ ఒప్పందంతో పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండొద్దని కేంద్రం కోరుకుంటోందన్నారు.
News January 8, 2026
‘రాజాసాబ్’ తొలి రోజే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందా?

రేపు విడుదలయ్యే ప్రభాస్ ‘రాజాసాబ్’పై అభిమానులతో పాటు నిర్మాత విశ్వప్రసాద్ భారీ ఆశలు పెట్టుకున్నారు. తొలిరోజే రూ.100Cr కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నామన్న ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రీమియర్ షోకు రూ.1000, తొలి 10రోజులు టికెట్ రేట్ను మల్టిప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించడం కలిసొచ్చే అంశం. మరి తొలిరోజే రూ.100Cr కలెక్ట్ చేస్తుందా? COMMENT
News January 8, 2026
ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభం.. అజెండాలో 35 అంశాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సుమారు 35 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలు, బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ తదితర అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.


