News March 13, 2025

ములుగు: స్కూల్ బస్సులు భద్రమేనా!

image

ములుగు జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళనలు నెలకొంది. సరైన ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం లేని డ్రైవర్లులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుబులు చెందుతున్నారు. మద్యం మత్తులో, మరమ్మతుకు వచ్చిన పాఠశాల బస్సులు నడిపి ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించకపోవడం గమనార్హం.

Similar News

News December 1, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

image

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.

News December 1, 2025

శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

image

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.

News December 1, 2025

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07041 SC-AKP రైలు డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం, నం.07042 AKP-SC రైలు డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని చెప్పారు.