News March 8, 2025
ములుగు: ‘2 నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదు’

ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద 2 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా కృషి చేయాలని కోరారు.
Similar News
News October 25, 2025
జిల్లాలో పాఠశాలలకు 3 రోజులు సెలవులు: కలెక్టర్

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 27 నుంచి 29 వరకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరు కావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలలోని విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 25, 2025
‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్బందీగా పూర్తి చేయాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దశలవారీగా, లోపాలకు తావు లేకుండా పూర్తి చేస్తామని వివరించారు.
News October 25, 2025
విద్యార్థులు ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలి: బాలలత

విద్యార్థులు వారికి ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేసిన బాలలత సూచించారు. వరంగల్ నిట్లో జరుగుతున్న టెక్నోజియాన్ రెండో రోజు ఆమె చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచిస్తూ, విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని ఆలోచన, సృష్టికి వినియోగిస్తారని పేర్కొన్నారు.


