News March 1, 2025
ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.
Similar News
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
జనవరిలో కొత్త ITR ఫారాలు: CBDT

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం వచ్చే ఏడాది APR 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చట్టంలో ఉన్న రూల్స్తో ITR ఫారాలను జనవరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు CBDT వెల్లడించింది. పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త చట్టానికి అనుగుణంగా అకౌంటింగ్ సాఫ్ట్వేర్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఇక సరైన రిఫండ్ క్లెయిమ్లను DECలోగా పరిష్కరిస్తామని వివరించింది.
News November 18, 2025
AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కన్నుమూత

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కాగా, ఆయన ఏడాదిగా క్యాన్సర్తో పోరాడారు. ఈ క్రమంలోనే కరీంనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలం మొత్తం AIFBలోనే కొనసాగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు.


