News April 13, 2025
ములుగు : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్, జిల్లా నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
Similar News
News April 23, 2025
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

IPLలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్ల్లోనే 5,000 పరుగులు చేసిన ప్లేయర్గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న LSGతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ(57*) చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(135Inns), విరాట్ కోహ్లీ(157Inns), డివిలియర్స్(161Inns), ధవన్(168Inns) ఉన్నారు.
News April 23, 2025
VJA: యువతిని బెదిరించి బంగారంతో జంప్

యువతిని నమ్మించి వంచన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన యువతికి (25) ఓ డేటింగ్ యాప్లో అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ మంగళవారం కలుసుకున్నారు. యువతిని హోటల్ రూమ్కు తీసుకువెళ్లిన సదరు వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 23, 2025
ASF: ప్రత్యేక లోక్ అదాలత్పై 28న సమావేశం

జిల్లాలో జూన్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు ASF న్యాయస్థానం ఆవరణలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా న్యాయమూర్తి రమేవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.