News April 14, 2025
ముస్తాబాద్: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

ముస్తాబాద్ మండల కేంద్రంలో ఓ తల్లి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిప్పలపల్లి గ్రామానికి చెందిన పొడేళ్ల సృజన పురిటినొప్పులతో మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. మహిళా డాక్టర్ స్రవంతి పరీక్షలు చేసి డెలివరీ కోసం ఆపరేషన్ చేస్తుండగా ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Similar News
News November 25, 2025
NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
News November 25, 2025
ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. వారే కీలకం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఖమ్మంలో 8,02,691మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే 26,182 మంది, కొత్తగూడెంలో 6,69,048 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 18,934 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులను నిలపాలని యోచిస్తున్నాయి. కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను పోటీకి సిద్ధం చేస్తున్నారు.
News November 25, 2025
అమరావతికి మహార్దశ.!

అమరావతిలో రాజధాని అభివృద్ధి నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్కు నిరాశ మిగలనుంది. ప్రధాన రైల్వే జంక్షన్గా ఉన్న విజయవాడ స్టేషన్లో రద్దీ దృష్ట్యా 10 ప్లాట్ఫామ్స్కి అదనంగా 2 నిర్మించాలని రైల్వే శాఖ భావించింది. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి అమరావతిలో కొత్త టెర్మినల్ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ విస్తరణను అధికారులు నిలిపివేశారు. వీటికి అయ్యే ఖర్చును రైల్వే శాఖ అమరావతి, గన్నవరం స్టేషన్లపై పెట్టనుంది.


