News February 10, 2025
ముస్తాబాద్: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

ముస్తాబాద్ మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి నామాపూర్, మొర్రపూర్, సేవాలాల్ గ్రామాలలో దాడులు నిర్వహించగా 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News December 4, 2025
ADB: పల్లె నుంచే గడ్డెన్న ప్రస్థానం..!

ముధోల్ నియోజకవర్గం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పేరు గడ్డెన్న. భైంసా మండలం దేగం సర్పంచిగా మొదలైన ఆయన ప్రస్థానం 6 సార్లు ఎమ్మెల్యే ఓసారి మంత్రి వరకు కొనసాగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. అందుకే ఆయనంటే పల్లె ప్రజల్లో ఓ గౌరవం. గడ్డెన్న తన బిడ్డలను నేరుగా పెద్ద పదవులు కట్టబెట్టవచ్చు కానీ అలా చేయలేదు. కొడుకు విఠల్ రెడ్డిని సర్పంచ్గా పోటీ చేయించి, క్రమంగా శాసనసభ వరకు తీసుకెళ్లారు.
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
ఉన్నవ లక్ష్మీనారాయణ.. సాహిత్య, సామాజిక విప్లవకారుడు.!

తెలుగు నవలా సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ (1877-1958) ఉమ్మడి గుంటూరు జిల్లా వేములూరుపాడులో జన్మించారు. న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సామాజిక రుగ్మతలను ఎదిరించి, దళితుల అభ్యున్నతికి ఆయన రాసిన ‘మాలపల్లి’ నవల ఒక విప్లవాత్మక సృష్టి.


