News February 22, 2025
ముస్తాబాద్: మంటల్లో చిక్కుకొని మహిళ మృతి

ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామానికి చెందిన మహిళ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోగా అక్కడికక్కడే మృతి చెందిందని ఎస్ఐ గణేష్ తెలిపారు. చిన్న అంజవ్వ (52) అనే మహిళ తన కూతురి వివాహం కోసం ఇంటి చుట్టూ ఉన్న చెత్తను కాల్చి వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని శరీరం మొత్తం కాలిపై మృతి చెందింది. మృతురాలి భర్త బాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 15, 2025
బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన iBOMMA నిర్వాహకుడు!

TG: కూకట్పల్లిలో <<18292861>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అతడు విశాఖ వాసి అని, విదేశీయులతో కలిసి హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. OTTకి వచ్చిన సినిమాలను వెంటనే పైరసీ చేసి సైట్లో పెట్టి, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడని గుర్తించారు. సర్వర్ల పాస్వర్డులు సంపాదించారు. వందల హార్డ్డిస్కులు సీజ్ చేశారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
News November 15, 2025
21న జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఈనెల 21న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. కాకినాడ జడ్పీ కార్యాలయ హాలులో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాలకు అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన శనివారం ఆదేశించారు.
News November 15, 2025
పేలుడు పదార్థాల్లో రసాయనిక చర్యతోనే భారీ బ్లాస్టింగ్!

J&K నౌగామ్ పోలీసు స్టేషన్లో భారీ బ్లాస్టింగ్ ఉగ్రదాడి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఫరీదాబాద్(హరియాణా)లో వైట్కాలర్ టెర్రరిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న360 KGల కెమికల్ పేలుడు పదార్థాల్లో అత్యధిక భాగం ఈ PSలోనే ఉంచారు. శుక్రవారం రాత్రి వీటి నుంచి శాంపిల్స్ తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు PTI పేర్కొంది. ఘటనలో 9 మంది మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. PS తునాతునకలైంది.


