News February 3, 2025

ముస్తాబాద్: వైన్స్ పర్మిట్‌ రూమ్‌లో వ్యక్తి హఠన్మారణం

image

ముస్తాబాద్‌లోని కొత్త బస్టాండ్ సమీపంలోని వైన్ షాపు పర్మిట్ రూమ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సోమవారం హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నామాపూర్‌కు చెందిన తేపూరి నారాయణ(50) ఆదివారం రోజంతా పనిచేసి రాత్రి అక్కడే పర్మిట్ రూంలోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచాక పర్మిట్ రూంలోనే హఠాత్తుగా కిందపడి చనిపోయాడు. మృతునికి అతిగా మద్యంతాగే అలవాటు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 4, 2025

గంజాయి కేసులో 3 నెలల జైలుశిక్ష: సీఐ

image

గంజాయి అక్రమ తరలింపు కేసులో ఓ వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ JFCM కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి సోమవారం తీర్పు ఇచ్చారు. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో ASFమండలం గోండుగూడకి చెందిన మాడావి దేవ్రావు కిలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. సాక్ష్యాధారాలు పరిశీలించి, నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 నెలల జైలుశిక్ష రూ.5 వేల జరిమానా విధించారు.

News February 4, 2025

MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం

image

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో రామగుండం పోలీస్ కమీషనరేట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానం లభించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు సోమవారం సీపీ ఎం. శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలవగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు.

News February 4, 2025

రూ.5,447 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం: టీడీపీ

image

AP: మార్చి 12న వైసీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’పై టీడీపీ Xలో ఫైరయ్యింది. గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దీవెన కింద ₹5,447 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించింది. YS జగన్ విద్యార్థులు, వారి పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురి చేస్తే లోకేశ్ ₹800 కోట్లు విడుదల చేసి మనోధైర్యాన్ని నింపారని పేర్కొంది. YCP నేతలు ‘ఫీజు పోరు’ కలెక్టరేట్ల ముందు కాకుండా జగన్ యలహంక ప్యాలెస్ ముందు చేయాలంది.