News January 28, 2025

ముస్తాబైన కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం

image

ప్రతి సంవత్సరం మాఘపు అమవాస్య సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర బుధవారం నుంచి అంగరంగ వైభవంగా మొదలవనుంది. ఈ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతర 5 రోజులు సాగనుంది. ఈ జాతరకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకోవాలని ప్రధానార్చకుడు సాకేత్ శర్మ తెలిపారు.

Similar News

News November 20, 2025

రోజ్‌ మేరీ ఆయిల్‌‌తో ఎన్నో లాభాలు

image

పొడవాటి నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. వాటికోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ వాడతారు. వాటిల్లో ఒకటే రోజ్ మేరీ ఆయిల్. ఇందులో ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ బి ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లకు లోపలి నుంచి పోషణ ఇస్తుంది. జుట్టు నిగనిగలాడుతూ కాంతిమంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలలో చక్కటి ఫలితాలుంటాయి. త్వరగా పొడిబారే జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

News November 20, 2025

ఎప్‌స్టీన్ సీక్రెట్ ఫైల్స్ విడుదలకు ట్రంప్ సైన్

image

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సీక్రెట్ ఫైల్స్‌ విడుదలకు న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. తమ విజయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను <<18272345>>డెమోక్రాట్లు<<>> ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. 2019లో ఫెడరల్ జైలులో ఎప్‌స్టీన్ మరణంపై దర్యాప్తుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఈ బిల్లు కోరుతోంది. ఈ క్రమంలో ఎవరి పేర్లు బయటపడతాయోనని ఆసక్తి నెలకొంది.

News November 20, 2025

ములుగు: అంబేడ్కరా.. చలి నుంచి రక్షించు!

image

ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అటవీ ప్రాంతంలో చలి తీవ్రత పెరగడంతో మనుషులతో పాటు జంతువులు విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ఓ కోతుల గుంపు కూర్చొని చలికి వణుకుతోంది. ‘అంబేడ్కరా.. చలి నుంచి మమ్మల్ని కాపాడు’ అని విగ్రహం వద్ద కూర్చొని వేడుకున్నట్లు ఉన్న ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించారు.