News January 28, 2025

ముస్తాబైన కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం

image

ప్రతి సంవత్సరం మాఘపు అమవాస్య సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర బుధవారం నుంచి అంగరంగ వైభవంగా మొదలవనుంది. ఈ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతర 5 రోజులు సాగనుంది. ఈ జాతరకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకోవాలని ప్రధానార్చకుడు సాకేత్ శర్మ తెలిపారు.

Similar News

News December 16, 2025

2,757 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BA, B.COM, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 16, 2025

అనంత టీడీపీ MP వద్ద MLA సోదరుడు కమీషన్ డిమాండ్

image

10 శాతం కమీషన్ ఇవ్వాలంటూ TDP ఎంపీని సొంత పార్టీ ఎమ్మెల్యే సోదరుడు బెదిరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. రాయలసీమకు చెందిన టీడీపీ ఎంపీ బంధువు అనంతపురం జిల్లాలో రూ.7 కోట్ల విలువైన రైల్వే పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కమీషన్ డిమాండ్ చేయగా, కాంట్రాక్టర్ ఎంపీతో మాట్లాడుకోవాలన్నారు. దీంతో ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి ఫోన్ చేసి కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

News December 16, 2025

NTR: బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను పంపిణీ చేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏడు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఇంటింటి నుంచి తడి-పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, డీపీవో పి. లావణ్య కుమారి, తదితరులు పాల్గొన్నారు.