News January 28, 2025
ముస్తాబైన కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం

ప్రతి సంవత్సరం మాఘపు అమవాస్య సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర బుధవారం నుంచి అంగరంగ వైభవంగా మొదలవనుంది. ఈ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జాతర 5 రోజులు సాగనుంది. ఈ జాతరకి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైదరాబాద్ నుంచి భక్తులు అధికంగా విచ్చేసి స్వామి వారి ఆశీర్వాదాలు అందుకోవాలని ప్రధానార్చకుడు సాకేత్ శర్మ తెలిపారు.
Similar News
News November 11, 2025
షమీ అన్ని ఫార్మాట్లలో ఆడాలి: గంగూలీ

దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న భారత బౌలర్ షమీకి దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు. రంజీల్లో ప్రదర్శన చూస్తే ఆయన ఫిట్గా ఉన్నాడనే విషయం అర్థమవుతుందన్నారు. షమీ టీమ్ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడాలని దాదా ఆకాంక్షించారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ జట్టుకు ఎందుకు సెలక్ట్ అవట్లేదో అర్థం కావట్లేదన్నారు. ఈ సీజన్లో వెస్ట్ బెంగాల్ తరఫున 2 రంజీ మ్యాచుల్లో షమీ 15 వికెట్లు తీశారు.
News November 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 6

శంకర సువన కేసరీనందన|
తేజ ప్రతాప మహా జగవందన||
హనుమంతుడు సాక్షాత్తూ శివుని అంశ నుంచి జన్మించాడు. అలాగే కేసరి నందనుడు. ఆయన తేజస్సు, ప్రతాపం అపారం. అందుకే సమస్త జగత్తు ఆయనకు నమస్కరిస్తుంది. ఆయన దర్శనం, స్మరణ మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతాయి. ప్రతికూల పరిస్థితులలో భయం వీడేలా ఆయన తేజస్సు మనకు శక్తిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 11, 2025
KMR: వీధి కుక్కల బెడదకు చెక్ పడుతుందా?

వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన రద్దీ ఉండే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లాలో కూడా వీధి కుక్కల దాడికి గురై అనేక మంది గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


