News February 21, 2025
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది: కిషన్ రెడ్డి

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జారుతున్నాయని, ఆ స్థానాల్లో బీజీపీ పోటీ చేస్తుందని, ఈ మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News February 22, 2025
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: విశాఖ సీపీ

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలనీ, ఉమెన్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 22, 2025
సంగారెడ్డి: ఈనెల 24న పదో తరగతి పరీక్షలపై శిక్షణ

మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ఎంఈవోలకు, రూట్ ఆఫీసర్లకు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంటెంట్, డిపార్ట్మెంట్లకు ఈనెల 24న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ శిక్షణలో జిల్లా కలెక్టర్ పాల్గొంటారని చెప్పారు.
News February 22, 2025
మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.