News February 21, 2025
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది: కిషన్ రెడ్డి

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జారుతున్నాయని, ఆ స్థానాల్లో బీజీపీ పోటీ చేస్తుందని, ఈ మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా పాల తనిఖీలు

రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో జిల్లాలో 4 రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ను కేటాయించింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తించవచ్చు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉన్నాయని, వీటిల్లో ర్యాండమ్గా తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు.
News February 25, 2026
27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
శ్రీరంగపురం: సంతానం లేనివారు గరుడ ప్రసాదం తీసుకోండి- వేద పండితులు

శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతోందని ఆలయ అర్చకులు తెలిపారు. గురువారం ఉదయం జరగబోవు ధ్వజారోహణంలో భాగంగా గరుడ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. సంతానం లేని దంపతులు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతోందని వేద పండితులు చెబుతున్నారు. ప్రసాదం తీసుకునేవారు గురువారం ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని కోరారు.


