News August 30, 2024
మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, మున్సిపల్, పంచాయతీ అధికారులు రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలన్నారు.
Similar News
News December 19, 2025
NLG: 306 స్థానాల్లో గెలిచిన బీసీలు!

జిల్లాలో మొత్తం 869 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో మూడు పంచాయతీలు మినహా మిగతా 866జిపిలకు ఎన్నికలు నిర్వహించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటు, జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి 306 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. దీంతో జిల్లాలో 35.33 శాతం స్థానాలు బీసీలకే దక్కాయి.
News December 19, 2025
ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.
News December 19, 2025
కంప్యూటర్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ. అనిత తెలిపారు. 12వ తరగతి విద్యార్హత కలిగి, 18 నుంచి 35వ సంవత్సరాలలోపు వయస్సు గల వారికి నల్గొండ మహిళా ప్రాంగణంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.


