News November 21, 2024
మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభం: లోకేశ్

మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ హాల్ను విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద ఎత్తున హోటళ్లు తీసుకొస్తామన్నారు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News December 4, 2025
విశాఖ చేరుకున్న మంత్రి లోకేశ్

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్కు ఉత్తరాంధ్ర టీడీపీ, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు, కార్యకర్తలను కలిసిన వారి వద్ద నుంచి లోకేశ్ అర్జీలు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం జిల్లా భామిని గ్రామానికి చేరుకుంటారు. అనంతరం టీడీపీ నాయకులుతో సమవేశం నిర్వహిస్తారు. రాత్రికి ఆదర్శ పాఠశాలలో బస చేస్తారు.
News December 4, 2025
ఈఎస్ఐ గేటు వద్ద మృతదేహంతో ఆందోళన

ఈఎస్ఐ గేటు వద్ద కూర్మన్నపాలేనికి చెందిన మహిళ మృతి చెందడంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈఎస్ఐ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పార్వతి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గైనిక్ ప్రాబ్లం కావడంతో పార్వతి ఆసుపత్రిలో జాయిన్ కాగా పరిస్థితి విషమించటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు మృతదేహాన్ని గేటు వద్దకు తెచ్చి ఆందోళన చేపట్టారు
News December 4, 2025
విశాఖ: రక్షణలేని ఉక్కు నిర్వాసితుల స్థలాలు

ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలాల్లో కబ్జాదారులు చొరబడుతున్నారు. ఇటీవల గాజువాకలోని వికాస్ నగర్ ITI రోడ్డు వద్ద సర్వే నంబర్ 153 భూమిలో రాత్రికి రాత్రే 18 షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. బీసీ రోడ్డు శివాలయం దగ్గర ఆరేళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు అధికారులు నిర్మాణాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.


