News September 24, 2024

మూడు రోజుల్లో పంట నష్టపరిహారం: మంత్రి పొంగులేటి

image

రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మూడు రోజుల్లో నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. BRS హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని.. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో BRS నేతల్లా తాము దోచుకోలేదని అన్నారు.

Similar News

News November 20, 2025

ఖమ్మం: నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

image

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగులకు CCTV ఇన్స్టాలేషన్, బ్యూటీషియన్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ శిక్షణలో వసతి, భోజన సౌకర్యాలు ఫ్రీగా కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 20, 2025

తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి

image

ఖమ్మం కొత్త మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తన భార్య సాయి వాణిని భర్త భాస్కర్ అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా మొదట తన కన్న కూతురిని చంపేందుకు భాస్కర్ ప్రయత్నించగా అతడి నుంచి చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ దాడి ఘటనలో చిన్నారి మూడు వేళ్లు తెగిపోయాయని స్థానికులు తెలిపారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 20, 2025

ఖమ్మం: అమ్మ ఆదర్శ కమిటీలకు నిధులు విడుదల

image

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణ కోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ఖాతాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిధులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,160 పాఠశాలలకు సంబంధించి మొత్తం రూ.1,13,78,000 నిధులను విడుదల జారీ చేశారు. రెండు నెలల కాలానికి ఉద్దేశించిన ఈ నిధులను ఏఏపీసీ సభ్యులు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, టాయిలెట్ల శుభ్రత, ఆవరణ నిర్వహణ కోసం వినియెాగించాలని సూచించారు.