News March 11, 2025
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని సచివాలయాలలో చేపడుతున్న వివిధ రకాల సర్వే ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వివిధ అంశము లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ రకాల సర్వేలలో ఎ.యన్.యంలు తప్ప మిగిలిన సచివాలయ సిబ్బందిని సర్వే ప్రక్రియలలో వినియోగించుకొని త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు.
Similar News
News October 21, 2025
GNT: సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నం ఉమేష్ చంద్ర

ఉమేష్ చంద్ర IPS స్వస్థలం తెనాలి సమీపంలోని పెదపూడి. నిజాయితీ, ధైర్యసాహసాలకు మారుపేరైన ఆయన ‘సూపర్ పోలీస్’గా పేరు తెచ్చుకున్నారు. విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నంగా నిలిచారు. 33 ఏళ్లకే మావోయిస్టుల తుపాకీ గుండ్లకు నేలకొరిగిన ఉమేష్ చంద్రను నేటికీ ఎంతోమంది స్ఫూర్తిగా భావిస్తారు. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ స్మరించుకుంటున్నారు.
News October 21, 2025
భద్రాద్రి: ఆ విషాదానికి 28 ఏళ్లు..ఎప్పటికీ మర్చిపోలేం

కరకగూడెం ఠాణాపై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పినపాక(M) పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997 జనవరి 9న అర్ధరాత్రి సుమారు 100 మంది మావోయిస్టులు కరకగూడెం ఠాణాపై దాడికి పాల్పడి, స్టేషన్ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా, పోలీసులు ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు స్టేషన్ను లూటీ చేసి వెళ్లిపోయారు.
News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.