News March 11, 2025

 మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని సచివాలయాలలో చేపడుతున్న వివిధ రకాల సర్వే ప్రక్రియ మూడు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వివిధ అంశము లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ రకాల సర్వేలలో ఎ.యన్.యంలు తప్ప మిగిలిన సచివాలయ సిబ్బందిని సర్వే ప్రక్రియలలో వినియోగించుకొని త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు.

Similar News

News December 5, 2025

ఈ కంటెంట్ ఇక నెట్‌ఫ్లిక్స్‌లో..

image

Warner Bros(WB)ను నెట్‌ఫ్లిక్స్ <<18481221>>సొంతం<<>> చేసుకోవడంతో విస్తృతమైన కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. 2022 లెక్కల ప్రకారం WBలో 12,500 సినిమాలు, 2,400 టెలివిజన్ సిరీస్‌లు(1,50,000 ఎపిసోడ్లు) ఉన్నాయి. దాదాపు 1,45,000 గంటల కంటెంట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, హ్యారీపొటర్, ది సోప్రానోస్, ఫ్రెండ్స్, ది మెంటలిస్ట్, సూపర్ న్యాచురల్, ది వైర్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను WBనే నిర్మించింది.

News December 5, 2025

నరసరావుపేట ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సస్పెండ్: DMHO

image

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన వైద్య నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్‌లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ నారాయణ స్వామిని సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్యశాఖ అధికారి రవి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

image

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.