News April 20, 2024

మూడో రోజు 14 నామినేషన్లు దాఖలు: కలెక్టర్

image

రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు 14 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 3వ రోజు హిందూపురం పార్లమెంటుకు సంబంధించి 4 సెట్లు నామినేషన్ దాఖలు అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగిందన్నారు.

Similar News

News September 30, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి అమ్మాయి

image

తాడిపత్రి పట్టణంలోని కస్తూర్బాలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కొప్పల నందిని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ మునెమ్మ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలలో అండర్- 19 విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు విద్యార్థినిని పీఈటీ చంద్రకళ, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

News September 30, 2024

వరద బాధితులకు తాడిపత్రికి చెందిన సంస్థ రూ.కోటి విరాళం

image

తాడిపత్రిలోని అర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ మూర్తి సీఎం చంద్రబాబునాయుడును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధి గురించి సీఎంకు వివరించారు.

News September 30, 2024

సీడ్ యాప్ రాష్ట్ర ఛైర్మన్‌గా రాయదుర్గం వాసి

image

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ నూతన ఛైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఆయన విజయవాడలోని డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.