News March 26, 2025

మూఢనమ్మకాలను నమ్మవద్దు: DMHO

image

చేతబడులు, మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని అల్లూరి DMHO జమాల్ భాషా అవగాహణ పరిచారు. మంగళవారం అరకులోయ మండలంలో పర్యటించిన DMHO జమాల్ భాషా లోతేరు పంచాయతీలో చేతబడి నెపంతో హత్య జరిగిన డుంబ్రిగుడ గ్రామాన్ని సందర్శించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. నాటువైద్యం, పసర మందులను జోలికి పోవద్దని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

సిర్గాపూర్: ప్రత్యర్థులుగా పిన్ని.. పిన కొడుకు

image

రాజకీయంలో చాలా చోట్ల ఇంటి పోరు సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సిర్గాపూర్ మండలం ఉజులంపాడ్ గ్రామంలో ఈ సమస్య ఎదురయింది. మొన్నటి వరకు ఒకటిగా ఉన్న వీరు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నువ్వా.. నేనా.. అంటూ విడిపోయారు. స్థానిక మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి కుమారుడు శశికాంత్ రెడ్డి, ఆయన చిన్నమ్మ పద్మజ ప్రత్యర్థులయ్యారు. శశికాంత్ రెడ్డిని కాంగ్రెస్ బలపరచగా, పిన్ని పద్మజకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలుకుతున్నారు.

News December 16, 2025

నేటి నుంచి మహిళా సంఘాలు బడ్జెట్‌పై శిక్షణ ప్రారంభం

image

మహిళా సంఘాలు బడ్జెట్ ప్రణాళికపై 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 6 మండలాలు వారికి రాజవొమ్మంగి మండల మహిళా సమైక్య కార్యాలయం శిక్షణ కొనసాగుతుందని APM రామాంజనేయులు తెలిపారు. రాజవొమ్మంగి, నెల్లిపాక, గూడెం కొత్తవీధి, దేవిపట్నం, వి.ఆర్.పురం, అరకు వేలి APMలు, సీసీలు, ఎల్ సీసీ, అకౌంటెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

News December 16, 2025

తూ.గో: నేటితో 3 ఏళ్ల నిరీక్షణకు తెర.!

image

పుస్తకాలే ప్రపంచంగా.. కఠిన శ్రమతో సాగించిన పోరాటం నేడు ఫలించనుంది. సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నికల జాప్యం అనంతరం తూ.గో జిల్లాలో 381 మంది కానిస్టేబుల్ ఉద్యోగ కల సాకారమైంది. మంగళగిరిలో నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీరు నియామక పత్రాలు అందుకోనున్నారు. RJYకి చెందిన అచ్యుతరావు రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఏళ్ల నిరీక్షణ తర్వాత కొలువు దక్కనుండటంతో అభ్యర్థుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.