News March 26, 2025

మూఢనమ్మకాలను నమ్మవద్దు: DMHO

image

చేతబడులు, మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని అల్లూరి DMHO జమాల్ భాషా అవగాహణ పరిచారు. మంగళవారం అరకులోయ మండలంలో పర్యటించిన DMHO జమాల్ భాషా లోతేరు పంచాయతీలో చేతబడి నెపంతో హత్య జరిగిన డుంబ్రిగుడ గ్రామాన్ని సందర్శించారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని సూచించారు. నాటువైద్యం, పసర మందులను జోలికి పోవద్దని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 5, 2026

KNR: నిలిచిన రిజిస్ట్రేషన్లు.. మూడు రోజులుగా ఇదే గోస!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సాంకేతిక విఘాతం ఏర్పడింది. గత 3రోజులుగా సర్వర్‌ మొరాయిస్తుండటంతో క్రయవిక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారు కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫైళ్లు పెండింగ్‌లో పడటంతో రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది ప్రక్రియను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

News January 5, 2026

వారానికి 5 రోజులే పని చేస్తామని డిమాండ్.. కరెక్టేనా?

image

వారానికి 5 రోజులే పని చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. UPIతో పనిభారం చాలా వరకు తగ్గిందని.. ఇప్పటికే రెండు, నాలుగో శనివారాలు సెలవులు ఉన్నాయి కదా అని పలువురు గుర్తు చేస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ పెంచేందుకు సెలవులు అవసరమని ఉద్యోగులు అంటున్నారు. వారానికి రెండు సెలవులతో బ్యాంకుల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. COMMENT?

News January 5, 2026

మహిళల భద్రతకు ‘పోష్‌’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

image

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.