News April 14, 2025

మూలపాలెంలో పిడుగు పాటుకు దగ్ధమైన వరికుప్ప

image

బాపట్ల మండలం మూలపాలెంలో వరికుప్పపై పిడుగు పడిన ఘటన ఆదివారం చోటు చేసుకొంది. బాపట్ల పరిధిలో భారీ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీయడంతో పిడుగు పడి వరి కుప్ప దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 2 ఎకరాల వరి కుప్ప దగ్ధమైనట్లు రైతు వినయ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 8, 2025

డిసెంబర్ 8: చరిత్రలో ఈ రోజు

image

1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
1939: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి జననం(ఫొటోలో)
1953: హాస్యనటుడు మనోబాల జననం
1984: తెలుగు నటి హంసా నందిని జననం
2004: టాలీవుడ్ డైరెక్టర్ చిత్తజల్లు శ్రీనివాసరావు మరణం
2014: కర్ణాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం

News December 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 8, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సమీక్షించనున్నట్లు ఆదివారం వివరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.