News August 18, 2024
మూసాపేట్: చికెన్ తీసుకురాలేదని వైన్స్లో గొడవ

ఆర్డర్ చేసిన చికెన్ తీసుకురాలేదని కస్టమర్లకు, యజమానికి మధ్య గొడవ జరిగిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సంకలమద్ది గ్రామానికి చెందిన నలుగురు యువకులు మండల కేంద్రంలోని ఓ వైన్స్లో చికెన్ ఆర్డర్ చేశారు. డ్రింక్ పూర్తయ్యే వరకు చికెన్ రాకపోవడంతో సీసా పగలగొట్టి గొడవకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలిపారు.
Similar News
News January 9, 2026
ఫిబ్రవరి 3 పాలమూరుకు సీఎం రాక

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3న సీఎం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో భాగంగా తొలి సభను పాలమూరులో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిరసనతో పాటు, ఎన్నికల వ్యూహాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
News January 8, 2026
మహబూబ్ నగర్: భార్యాపిల్లల దాడిలో భర్త దారుణ హత్య

మహబూబ్నగర్ జిల్లాలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పండ్ల వ్యాపారి విస్లావత్ రాములు (56)ను భార్య, పిల్లలే కలిసి కర్రలు, రాడ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొడవ ముదరడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
News January 8, 2026
MBNR: PM శ్రీ క్రీడా పోటీలు విజేతలు వీరే (2/3)

MBNRలోని ‘DSA’ మైదానంలో పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.
✒ఖో-ఖో (బాలుర భాగం)
1st place(జడ్పీహెచ్ఎస్ బాయ్స్ బాదేపల్లి)
2nd place(జడ్.పి.హెచ్.ఎస్ నవాబ్పేట్)
✒ఫుట్ బాల్(బాలుర విభాగం)
1st place (ZPHS రాజాపూర్)
2nd place (ZPHS బాయ్స్ బాదేపల్లి)
✒100 మీటర్స్ రన్నింగ్(బాలుర)
1st place పాల్ (ZPHS బాదేపల్లి)
2nd place కే.శ్రీనాథ్ (ZPHS నవాబ్పేట్)


