News April 3, 2025

మూసీకి పూడిక ముప్పు..!

image

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.

Similar News

News April 11, 2025

17లోగా పేర్లు నమోదు చేసుకోవాలి: డీఈవో భిక్షపతి

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ నెల 19న నిర్వహించే ఉపగ్రహ సాంకేతిక దినోత్సవంలో భాగంగా నిర్వహించే ఆర్యభట్ట స్వర్ణజయంతి ఉత్సవాల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్లో ఈ నెల 17లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 11, 2025

NLG: కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం కొరత

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో బియ్యం కొరత ఏర్పడింది. రేషన్ కార్డు దారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండటంతో గ్రామాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి పలు పనుల నిమిత్తం పట్టణాల్లో నివసిస్తుంటారు. అలాంటి వారు కూడా పట్టణంలోని పలు షాపుల్లో సన్నబియ్యం తీసుకోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 31,22,941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.

News April 11, 2025

నేడు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం

image

వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఈ నెల 11న శుక్రవారం (నేడు) రోజున ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు విచ్చేసి గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక శ్రద్ధతో అర్జీల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!