News August 12, 2024
మూసీ పేరిట అప్పులు తెచ్చే పనిలో ప్రభుత్వం?

మూసీ పేరిట అప్పులు తెచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం చక్కర్లు కొడుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 55 కిలోమీటర్లు మేర విస్తరించిన మూసీ నది సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటోంది. భారీ అంచనా వ్యయానికి తగినట్లు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి.. మూసీ పేరిట అప్పులు తెచ్చే పనిలో పడింది.
Similar News
News November 13, 2025
నాగార్జున- సురేఖ కేసు.. DEC2కు విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసు మరోసారి వాయిదా పడింది. HYDలోని ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే.
News November 13, 2025
HYD: మనం తాగే మినరల్ వాటర్ సేఫేనా?

నగరంలో పుట్టగొడుగుల్లాగా వెలసిన RO ప్లాంట్లపై అధికారుల తనిఖీలు ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కీళ్లనొప్పులు, హెయిర్లాస్ వంటి సమస్యలు ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ వల్లే వస్తాయనే అధ్యయనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ప్లాంట్లలో, డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలనే కనీస అవగాహన కరవైందని వాపోతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి, ప్లాంట్లపై స్పష్టమైన నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 13, 2025
‘నిలోఫర్’ సమస్యలంటే సర్కారుకు చులకనే..!

నిలోఫర్ అస్పత్రి అంటే అదో ధైర్యం.. అక్కడ వైద్యానికి వెళ్తే పిల్లలకేం కాదనేది ఓ నమ్మకం. అయితే నిలోఫర్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మొరాయించే లిఫ్టులు పేషెంట్లకు నరకం చూపిస్తాయి. ఇక వెయిటింగ్ హాల్ ప్రారంభం కాక అలాగే ఉండిపోయింది. రోజూ 1,200 నుంచి 1,500 ఓపీ నమోదవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా ఇక్కడ బెడ్స్ సమస్య చిన్నారులను వేధిస్తోందని పేరెంట్స్ వాపోతున్నారు.


