News January 26, 2025
మృతులు రాయచోటి వాసులుగా గుర్తింపు

బి.కొత్తకోట మండలం కనికలతోపు వద్ద ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఫయాజ్(30), సిబ్బాలకు చెందిన మహీంద్ర(28)గా గుర్తించినట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని టీ కోసం రోడ్డు పక్కన నిలపగా.. కోళ్ల లోడుతో కదిరి నుంచి రాయచోటి వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు.
Similar News
News October 13, 2025
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు 10 మంది మినిస్టర్లతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, DSBV స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, గొట్టిపాటి రవి కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
News October 13, 2025
PDPL: 6 నెలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం జరుగుతున్న జడ్పీ కాంప్లెక్స్ పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఆరు నెలల్లో నాణ్యతతో పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులపై ఇంజినీరింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ సందర్బంగా ZP సీఈఓ నరేందర్, EE గిరీష్ బాబు, తహశీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News October 13, 2025
నూతన సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్: CMD

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేరుస్తూ నూతన సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని APSPDCL నూతన CMD శివశంకర్ అన్నారు. తిరుపతిలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ను అభివృద్ధి చేసి రివర్స్ పవర్ సాధిస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.