News January 26, 2025

మృతులు రాయచోటి వాసులుగా గుర్తింపు

image

బి.కొత్తకోట మండలం కనికలతోపు వద్ద ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఫయాజ్(30), సిబ్బాలకు చెందిన మహీంద్ర(28)గా గుర్తించినట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న లారీని టీ కోసం రోడ్డు పక్కన నిలపగా.. కోళ్ల లోడుతో కదిరి నుంచి రాయచోటి వస్తున్న బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు.

Similar News

News September 13, 2025

NRPT: ఆశ, అత్యాశే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు

image

ప్రజల ఆశే సైబర్ నేరగాళ్లు బలహీనతగా భావించి ఆర్థిక నేరాలకు పాల్పడతారని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. విలాసవంతమైన వస్తువులు ఇస్తామని విదేశీ యాత్రలకు పంపుతామని ఆఫర్లను ప్రకటించి ఖాతాలో డబ్బులు జమ చేయాలంటూ వచ్చే ఫోన్ కాల్స్ నమ్మకండని హెచ్చరించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీముల జోలికి వెళ్లకూడదని చెప్పారు. APK ఫైల్స్ ఓపెన్ చేయకూడదని, అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఓటిపి వివరాలు ఇవ్వకూడదని అన్నారు.

News September 13, 2025

HYD: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

image

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.

News September 13, 2025

HYD: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

image

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.