News July 11, 2024

మృత్యు వారధిగా మారిన చించినాడ బ్రిడ్జి

image

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు.

Similar News

News December 9, 2025

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.

News December 9, 2025

రతన్ టాటా హబ్‌లో ‘స్పార్క్’ కార్యక్రమం ప్రారంభం

image

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మంగళవారం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఫర్ అడ్వాన్స్‌డ్ & రియల్‌టైమ్ నాలెడ్జ్ (‘స్పార్క్’) కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వై.మేఘా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యాన్ని, ఇన్నోవేషన్ హబ్ దృష్టికోణాన్ని చేరుకోవడానికి ఈ ‘స్పార్క్’ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.