News April 6, 2024
మెండోరా: NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గర్భిణి మృతి

మెండోరా(M) బుస్సాపూర్ NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి నదికి పూజలు చేసేందుకు వెళ్తున్నారు. రహదారి మధ్యలో ఉన్న పువ్వులు తెంపడానికి వచ్చింది. తిరిగి ఆటో వద్దకు వెళ్లే క్రమంలో ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గర్భిణి మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
నిజామాబాద్: సంక్రాంతి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి!

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.
News January 5, 2026
NZB: చైనా మంజాతో ప్రాణహాని జరిగితే హత్య కేసు: సీపీ

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 5, 2026
NZB: చైనా మంజాతో ప్రాణహాని జరిగితే హత్య కేసు: సీపీ

చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాంజా వల్ల ఎవరికైనా ప్రాణహాని కలిగితే బాధ్యులపై ‘హత్యా నేరం’ (Murder Case) కింద కేసు నమోదు చేస్తామన్నారు. మాంజా విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరి వద్దనైనా మాంజా ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, విక్రయించే వారి గురించి తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.


