News April 6, 2024
మెండోరా: NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గర్భిణి మృతి

మెండోరా(M) బుస్సాపూర్ NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి నదికి పూజలు చేసేందుకు వెళ్తున్నారు. రహదారి మధ్యలో ఉన్న పువ్వులు తెంపడానికి వచ్చింది. తిరిగి ఆటో వద్దకు వెళ్లే క్రమంలో ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గర్భిణి మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
NZB: 30 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.
News February 23, 2026
NZB: మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందించిన సీపీ

4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో మెడల్స్ సాధించిన NZB సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సీపీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.
News February 23, 2026
NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 107 ఫిర్యాదులు

NZB కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ZP సీఈఓ సాయాగౌడ్ తదితరులకు విన్నవించి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


