News June 14, 2024
మెగా DSC నోటిఫికేషన్ విడుదల.. నిరుద్యోగుల్లో ఉత్సాహం
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువత మెగా DSC నోటిఫికేషన్ విడుదలతో ఉత్సాహం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో 2,636 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాలో కేవలం 180 పోస్టులనే చూపించారని, 1,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని DSC అభ్యర్థులు చెబుతున్నారు. తాజా నోటిఫికేషన్తో జిల్లాలో గరిష్ఠంగా టీచర్ పోస్టులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 2, 2024
కృష్ణా: రేపు టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులు
కృష్ణా, NTR జిల్లాలలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. 2 జిల్లాలలోని 9 కేంద్రాలలో మొత్తంగా 58,089 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు టెట్ పరీక్ష ఆన్లైన్లో జరుగుతోందని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
News October 2, 2024
గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్
మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.
News October 2, 2024
మైలవరం: మాజీ మంత్రి జోగి రమేశ్కు నోటీసులు
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి, మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ జోగి రమేశ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో నేడు హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు.