News March 8, 2025
మెట్పల్లి: ఆరోగ్య సమస్యలతోనే నవవరుడు ఆత్మహత్య

మెట్పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామం రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే<<15688708>> నవ వరుడు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా తమకు చెప్పలేదని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది
Similar News
News October 15, 2025
జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఇలా..

జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో పెగడపల్లిలో అత్యధికంగా 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కథలాపూర్లో 4.8, మల్యాల 1.8, ఐలాపూర్, జగ్గసాగర్ లో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. మంగళవారం పూడూరులో అత్యల్పంగా 21.6° ఉష్ణోగ్రత నమోదైంది.
News October 15, 2025
NLG: నిమ్మ ధరల పతనంతో రైతుల బేజారు

నిమ్మ ధరలు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలున్నాయి. దాదాపు 20 వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఒక బస్తా పండు కాయలు రూ.70 నుంచి 100లు, పచ్చికాయలు రూ.100 నుంచి 200కు మించి పలకడం లేదు.
News October 15, 2025
శ్రీశైలం రహదారిపై రేపు ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరారు.