News July 25, 2024
మెట్పల్లి: ఒక్క రోజే నాలుగు డెంగ్యూ కేసులు

మెట్పల్లి పట్టణంలో ఒక్క రోజే నలుగురికి డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. వారికి మెట్పల్లి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ టి.మోహన్తో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వో పేషెంట్ల ఇళ్లకు వెళ్లి శానిటేషన్ చేయించారు. ఇద్దరి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 16, 2025
కరీంనగర్: ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు: సీపీ

తమ కార్యాలయ పరిధిలో కొంతమంది పోలీసులు నెంబర్ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్/సీట్బెల్ట్ ధరించకపోవడం, బ్లాక్ ఫిల్మ్ వాడటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు గుర్తించిన సీపీ, కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి, పోలీసులు అయినా సరే, కఠినంగా ఈ-చలాన్లు జారీ చేయాలని ఏసీపీ ట్రాఫిక్కు ఆయన స్పష్టం చేశారు.
News November 15, 2025
భరోసా కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.
News November 15, 2025
కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.


