News August 16, 2024

మెట్పల్లి కిడ్నాప్ కేసులో బయటకొస్తున్న మరికొన్ని విషయాలు

image

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసు నిందితుడి విచారణలో సంచలన విషయాలు బయట పడ్డాయి. నిందితుడు నాగేశ్, అతని భార్య లావణ్య 3 నెలల్లో ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి ఇద్దరిని ఈ ఏడాది జూన్‌లో అమ్మినట్లు తేలింది. జూన్‌లో ఆరేళ్ల పాపతో పాటు మూడేళ్ల పాప‌ను కిడ్నాప్ చేసి ఒకరిని రూ.2 లక్షలకు, మరొకరిని రూ.1.50 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారనే విషయాలు తెలియాలి.

Similar News

News January 10, 2026

KNR: చైనా మాంజా వాడితే కఠిన చర్యలు: సీపీ

image

సంక్రాంతి వేళ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. నైలాన్ దారాల వల్ల పక్షులు, వాహనదారులకు ప్రాణాపాయం ఉందని, వీటిపై నిఘాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం కాటన్ దారాలనే వాడి, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.

News January 10, 2026

KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గత పది రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 6,665 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,553 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి నిల్వ చేయవద్దని, డిమాండ్ మేరకు మరిన్ని నిల్వలు తెప్పిస్తామని రైతులకు సూచించారు.

News January 10, 2026

KNR: ‘పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

image

మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్‌, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.