News February 12, 2025
మెట్పల్లి: తల్లిదండ్రులపై కుమారుడి దాడి

మెట్ పల్లి పట్టణంలో బుధవారం వేకువ జామున మానసిక స్థితి సరిగా లేక ఏళ్ళ అన్వేష్ (35) తన తల్లిదండ్రుల పై కత్తి, కొడవలితో దాడికి పాల్పడినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో తల్లి రమాదేవికి మెడ, చేతి భాగంలో, తండ్రి గంగ నరసయ్యకు ఎడమ చేతి వేలు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. ఘటనపై తండ్రి గంగ నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెంటల్ యాక్ట్, హత్యాయత్నం కింద కేసు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
Similar News
News December 7, 2025
కొత్తగూడెం: మత్తులో ట్రాక్ దాటుతూ రైలు కిందపడి..

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 7, 2025
విజయవాడ: ‘నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ కీలకం’

నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేశ్ను గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు రూ. 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లడానికి కూడా జోగి రమేశే కారణమని వెల్లడించింది.
News December 7, 2025
అఫీషియల్.. మాజీ ప్రధాని ప్రేమాయణం

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోతో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. జపాన్ పర్యటనలో దిగిన సెల్ఫీని Instaలో షేర్ చేశారు. ఫ్రాన్స్లో అక్టోబర్ 25న పెర్రీ పుట్టినరోజు వేడుకల్లో వీరిద్దరూ తొలిసారి పబ్లిక్లో కనిపించారు. కాగా 53 ఏళ్ల ట్రూడోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2023లో భార్య నుంచి విడిపోయారు. పెర్రీకి 2010లో పెళ్లి కాగా 2012 నుంచి విడిగా ఉంటున్నారు.


