News February 13, 2026

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా

image

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ సత్తా చాటింది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. అందులో బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకోగా స్వతంత్రులు 4 స్థానాలలో గెలుపొందారు. కాగా, ఛైర్‌పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఛైర్‌పర్సన్ ఎన్నికలో స్వతంత్రులు కీలకం కానున్నారు.

Similar News

News March 17, 2026

రాజమండ్రి: మార్చి 19న ఉగాది పురస్కారాలు

image

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను గౌరవించేందుకు మార్చి 19న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం’ నిర్వహించనున్నట్లు MP పురందీశ్వరి మంగళవారం తెలిపారు. నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద ఈ వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సముచిత రీతిలో సన్మానిస్తామని వెల్లడించారు.

News March 17, 2026

అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

News March 17, 2026

జగిత్యాల: కుక్క కాటు.. ప్రాణం తీసింది..!

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మణితేజ(7) కుక్కకాటుకు గురై, 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2024 డిసెంబర్ 26న మెడ భాగంలో కుక్క కరవడంతో వెంటనే HYDలో చికిత్స అందించారు. అనంతరం ఇంట్లోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్యం కొనసాగించారు. సుమారు రూ.65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు.