News April 3, 2025

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌‌లో పసుపు ధర ఇలా

image

జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు ధర ఈవిధంగా ఉన్నాయి. ఈరోజు పసుపు కాడి గరిష్ఠ ధర రూ.14,395, కనిష్ఠ ధర రూ.9,009, పసుపు గోళం గరిష్ఠ ధర రూ.13,556, కనిష్ఠ ధర రూ.8,888 పసుపు చూర గరిష్ఠ ధర రూ.10,445, కనిష్ఠ ధర రూ.9,292గా పలికిందని కార్యదర్శి తెలిపారు. ఈరోజు మొత్తం 1783 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

ఎప్‌స్టీన్ ఇంట్లో ట్రంప్ గంటలు గడిపాడు: డెమోక్రాట్లు

image

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ గంటలకొద్ది సమయం వెచ్చించాడని డెమోక్రాట్లు ఈమెయిల్స్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బాలికల లైంగిక వేధింపుల గురించి ముందే తెలుసని ఆరోపించారు. అయితే ఇది డెమోక్రాట్లు పన్నిన ఉచ్చు అని ట్రంప్ ఖండించారు. వారి మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు డెమోక్రాట్లు ఏమైనా చేస్తారని ఫైరయ్యారు.

News November 13, 2025

నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీమ్స్

image

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.

News November 13, 2025

ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

image

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.