News March 18, 2025

మెట్రో ప్రయాణికులకు GOOD NEWS

image

మెట్రో ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఎండలు పెరిగిపోతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక మెట్రోలో వెళ్లాలంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రిప్పుల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,065 ట్రిప్పులు తిరుగుతుండగా త్వరలో 1,500 వరకు పెంచుతామని తెలిపారు.

Similar News

News July 11, 2025

HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

image

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.

News July 11, 2025

HYD: IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్

image

IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాథ్ వర్క్ TiHAN పేరిట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి జులై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. ఈ కాంపిటీషన్లో మూడు రౌండ్లు ఉంటాయన్నారు. కాంపిటీషన్ మెటీరియల్ సైతం అందించే అవకాశం ఉందన్నారు. వెబ్‌సైట్ spr.ly/60114abzL ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

News July 11, 2025

GHMCలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

image

GHMCలో డిప్యూటీ కమిషనర్‌లు బదిలీ అయ్యారు. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు పొందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మంది ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లు పొందారు.