News February 21, 2025
మెదక్లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 26, 2026
మెదక్: అభివృద్ధికి కలెక్టర్ రాహుల్ రాజ్ కృషి

గత రెండేళ్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పదవ తరగతి ఉత్తీర్ణత 93 నుంచి 97 శాతానికి పెరిగింది. 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఆరోగ్య కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపరిచారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంతో పాటు, వేలాది భూ సమస్యలను పరిష్కరించి పాలనలో వేగం పెంచారు.
News February 26, 2026
మెదక్ కలెక్టర్గా ప్రతిమా సింగ్

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్గా ప్రతిమ సింగ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్గా ఉన్న రాహుల్ రాజ్ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. కలెక్టర్గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే.
News February 26, 2026
BREAKING: మెదక్ కలెక్టర్ బదిలీ

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రాజ్ 2024 మార్చి 6న ఆదిలాబాద్ నుంచి మెదక్ కలెక్టర్గా బదిలీపై వచ్చారు. మెదక్ కలెక్టర్గా రంగారెడ్డి (లోకల్ బాడీస్) అదనపు కలెక్టర్ 2019 బ్యాచ్కు చెందిన ప్రతీమ సింగ్ IAS నియమితులయ్యారు.


