News March 19, 2025
మెదక్లో తల్లీకూతురు మిస్సింగ్.. కేసు నమోదు

మెదక్ పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన చెందిన ఎం. విజయలక్ష్మి(54) తన కూతురు ఎం. మణిదీపిక (27)లు సోమవారం మిస్ అయ్యారు. మెదక్లోని వారి ఇంట్లో నుంచి వెళ్లిన వీరు ఇద్దరూ కనిపించట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే 8712657878, 8712657913 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.
Similar News
News November 25, 2025
మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
News November 25, 2025
మెదక్: కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.
News November 25, 2025
మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.


