News April 14, 2025
మెదక్: అంబేడ్కర్ను యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఏఎస్పీ

అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.
Similar News
News January 22, 2026
గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడగింపు

తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ ఆఫీసర్ అనురాధ తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈనెల 21 వరకు గడువు ఉండగా 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. 2026- 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవకాశం వినియోగించుకోవాలని ఆమె కోరారు
News January 22, 2026
రామాయంపేట: అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేట కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా ఒక్కో వార్డులో ముగ్గురు నలుగురు చొప్పున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే టిక్కెట్టు రానివారు రిబ్బన్స్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకులు మాత్రం రెబెల్స్ ను ప్రోత్సహించే నాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
News January 22, 2026
మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.


