News July 14, 2024
మెదక్: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసపోయిన ఘటన అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్ విడోస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి మే 19న ఆన్లైన్ ట్రేడింగ్కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి రూ.6.49లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడగ్గా స్పందించలేదు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 22, 2025
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
News November 22, 2025
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
News November 22, 2025
మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.


