News April 11, 2024
మెదక్: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోలు అంతంతే..!

అధికారులు ఆర్భాటంగా దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో 2,60,933 ఎకరాల్లో వరి సాగవగా.. 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పంట సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 200కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో కోనుగోళ్లు చేయట్లేదని రైతులు అంటున్నారు.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


