News March 19, 2025
మెదక్: ఇండియా టుడే లో ఎంఈవోకు చోటు

తూప్రాన్ ఎంఈఓగా పనిచేస్తున్న పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణకు ఇండియా టుడే టాప్-10 పాయనీరింగ్ మైండ్స్ ఆఫ్ 2025లో చోటు దక్కింది. భారతదేశపు అత్యంత టాప్-10 ప్రభావశీలుర మార్గదర్శక వ్యక్తుల్లో సత్యనారాయణ చోటు దక్కడం పట్ల మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 22, 2025
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
News November 22, 2025
మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎవరంటే!

మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శివన్నగారి ఆంజనేయులు గౌడ్ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణు గోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఆంజనేయులు గతంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకే ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
News November 22, 2025
మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.


