News March 23, 2025
మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. భర్త భూపతి బంధువుల ఇంట్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 18, 2025
దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.
News October 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాహుల్

పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ సూచించారు. టేక్మాల్ మండలంలోని బర్దిపూర్లో పత్తి పంటను ఆయన పరిశీలించారు. జిల్లాలో 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి పండించారని, పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పింజరకం(8110) రకానికి రూ. 8,110, పింజరకం(8060)కు రూ. 8,060 మద్దతు ధరలు ఉంది.
News October 18, 2025
మెదక్: ’25లోగా IFMIS పోర్టర్లో నమోదు చేయాలి’

మెదక్ జిల్లా అధికారులు, డీడీఓలు తమ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను ఈ నెల 25లోగా IFMIS పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఖజానా అధికారి అనిల్ కుమార్ మరాఠి ఆదేశించారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అక్టోబర్-2025 మాసానికి సంబంధించిన జీతాలు/గౌరవ వేతనాలు అందవని ఆయన స్పష్టం చేశారు.